మరో తెరాస ఎమ్మెల్యేకు కరోనా

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ప్రజా ప్రతినిధులు కూడా కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ముత్యంరెడ్డి, గొంగిడి సునీత తదితరులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఆయనతో పాటు ఆయన భార్య, కొడుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే వివేకానంద కుటుంబం హాస్పటల్ లో చేరకుండా ఇంట్లోని ఉంటూ చికిత్స తీసుకుంటోంది. ఎవరికి వారు వేర్వేరు గదుల్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు వివేకానంద తెలిపారు.

ఇక తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,296 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో ఆరుగురు కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45,076కి చేరింది. కరోనా సోకి మొత్తం 415 మంది చనిపోయారు. ఇప్పటివరకూ కోలుకుని 32,438 మంది డిశ్చార్జు కాగా ఆదివారం 1831 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.