ఏపీలో 4,074 కొత్త కేసులు, 54 మంది మృతి !

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్త నమోదవుతున్న కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,074 కేసులు నమోదయ్యాయి. 54 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,086 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 596, కర్నూల్‌లో 559 కేసులు వచ్చాయి.

ఇక తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున కరోనా వల్ల మరణించారు. కృష్ణా జిల్లాలో ఏడుగురు, అనంతపూర్‌ జిల్లాలో ఆరుగురు చొప్పున.. చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు చొప్పున.. కర్నూల్‌, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున.. కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.

ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,724కి చేరింది. యాక్టివ్‌ కేసులు 28,800 ఉండగా.. 24,228 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 696 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో 33,580 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.