అఖిల్ ‘మలుపు’ తీసుకొంటాడా ?

ఇటీవలే ప్రేక్షకులకు ‘హలో’ చెప్పి తొలి హిట్ ఖాతాలో వేసుకొన్నాడు అఖిల్ అక్కినేని. ఇప్పుడీ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లైన్ లో ఉన్నట్టు సమాచారమ్. అఖిల్ మూడో సినిమా కోసం కొరటాల శివ, బోయపాటి శ్రీను, సుకుమార్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడీ లిస్టులో మరో దర్శకుడు పేరు వినిపిస్తోంది. ఆది పినిశెట్టితో ‘మలుపు’ సినిమా తీసిన సత్య పినిశెట్టి ఆది కోసం ఓ డిఫరెంట్ కథని రెడీ చేశాడట. ఇటీవలే ఆ కథని అఖిల్ ని వినిపించాడు కూడా.

సత్య పినిశెట్టి చెప్పిన కథ అఖిల్’కి నచ్చేసింది. ఐతే, ఫైనల్ గా ఆ కథని నాగ్ ఫైనల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నాగ్ కథ నచ్చినా.. అఖిల్ ని సత్య పినిశెట్టి పెడతారా ? అన్నది అనుమానమే. ఎందుకంటే ? నాగ్ ఆలోచనలో మరోలా ఉన్నాయి. అఖిల్ కోసం నాగ్ కొరటాల, బోయపాటి, సుకుమార్ లాంటి దర్శకులని ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అఖిల్ ని నాగ్ ని ఒప్పించి మలుపు దర్శకుడిని సినిమాని ఓకే చేస్తాడా ? అన్నది వేచి చూడాలి.