#prabhas21 : దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

బాహుబలి ప్రభాస్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెతో కలిసి నటించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండేది. ఇప్పుడా కోరిక తీరనుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న సినిమా కోసం దీపికాని తీసుకొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆమెకి ఏకంగా రూ. 30కోట్ల పారితోషికం ఇవ్వనున్నారట. రూ. 25కోట్ల పారితోషికం, జీఎస్టీ ఇతర ఖర్చులని కలుపుకొని రూ. 30కోట్లు ముట్టజెప్పనున్నారట.
 
అయితే ఇదీ చాలా ఎక్కువ. తెలుగు ప్రేక్షకులకి దీపికా పదుకొనె అంటే ఇంకా క్రేజ్ ఉండొచ్చు. కానీ బాలీవుడ్ లో దీపికా క్రేజ్ బాగా తగ్గింది. ఆమె దాదాపు ఫేడ్ అవుట్ అయిందని చెబుతున్నారు. అయితే కేవలం ప్రభాస్ కోసమే దీపికాని తీసుకొన్నారట. ఈ సినిమా కథ చంద్రమామ కథలా ఉంటుందట. ప్రభాస్ రాజు లా కనిపిస్తారు. ఆయన పక్కన ఓ రాణి కావాలి కదా. అందుకే రాణిగా కనిపించే దీపిక పదుకొనె ని తీసుకొన్నామని నాగ్ అశ్విన్ చెబుతున్నారు.