దత్తత తీసుకున్న ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి కోడ‌లు, యంగ్ హీరో రాంచ‌ర‌ణ్ భార్య ఉపాస‌న సోమవారం పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె దత్తత తీసుకున్నారు. ఆమె దత్తత తీసుకుంది పాపనో, బాబునో కాదు. రాణి అనే ఏనుగుని. త‌న పుట్టిన రోజు పుర‌స్క‌రించుకుని జూపార్కును సంద‌ర్శించిన ఉపాస‌న రాణిని ద‌త్తత తీసుకున్నారు.

‘రాణి’ పోష‌ణ కోసం అయ్యే ఖ‌ర్చు కోసం రూ.5 ల‌క్ష‌ల చెక్‌ను క్యూరేట‌ర్‌, ఐఎఫ్ఎస్ అధికారి క్షితిజ‌కు ఆమె అంద జేశారు. ఉపాసన జంతు ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. ఇక క‌రోనాపై ఉపాస‌న అనేక అవ‌గాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె క‌రోనా నివార‌ణ‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్తల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చైత‌న్య‌ప‌రిచే పోస్టింగ్‌లు పెడుతున్న విష‌యం తెలిసిందే.