దేశంలో ప్రతిరోజూ 50వేల కొత్త కేసులు


దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఎంతలా అంటే.. ? రోజువారీగా నమోదవుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య 50వేలకి చేరువవుతున్నాయ్. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 45,720 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,38,635కు చేరింది. గడిచిన 24గంటల్లో అత్యధికంగా 685 మంది మృత్యువాతపడ్డారు. ఒకేరోజు ఈ స్థాయిలో మరణాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. దీంతో కరోనా మరణాల సంఖ్య 29,861కి చేరింది.

ఇక కరోనా మరణాల జాబితాలో భారత్ పైపైకి దూసుకొస్తోంది.   ప్రపంచంలో అత్యధికంగా కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల జాబితాలో భారత్‌ ఆరో స్థానానికి చేరువయ్యింది. ప్రస్తుతం 30వేల కొవిడ్‌ మరణాలతో ఫ్రాన్స్‌ ఆరో స్థానంలో ఉంది. దీనికి ఒక్కరోజు ముందే స్పెయిన్‌ సంఖ్యను దాటి భారత్‌ ఏడో స్థానంలోకి వచ్చింది. ఒక్కరోజు తేడాతో మరో స్థానానికి ఎగబాకి ఆరో స్థానంలోకి వచ్చేసింది.