చరణ్-నానిల మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా ?

‘ఛలో’ సినిమాతో ప్రతిభ ఉన్న దర్శకుడు అనిపించుకున్నాడు వెంకీ కడుముల. ‘భీష్మ’తో రెండో విఘ్నాన్ని దాటేశాడు. నితిన్-రష్మిక మందన జంటగా నటించిన భీష్మ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక వెంకీ తన తదుపరి సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కథ వినిపించారు. ఆయన కూడా ఓకే అనేశారు. వెంకీ మెగా ఆఫర్ దక్కిందని చెప్పుకొంటున్నారు. 

లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ?  నేచురల్ స్టార్ నాని కూడా వెంకీ కడుముల కథ చెప్పారట. నాని కూడా ఓకే చెప్పేశారు. వచ్చే యేడాది ప్రారంభంలోనే ఈ సినిమా పట్టాలెక్క ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే వెంకీ చరణ్, నానిలకి వేర్వేరు కథలు చెప్పారా ? లేదంటే.. ? వీరిద్దరితో కలిసి మల్టీస్టారర్ ఏమైనా ప్లాన్ చేశాడా ?? అనేది తెలియాల్సి  ఉంది. మంచి కథ దొరికితే టాలీవుడ్ స్టార్స్ మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరీ.. అలాంటి కథ ఏదైనా చరణ్-నానిలని కలిపిందా ? అన్నది తెలియాల్సి ఉంది.