రొమాన్స్ లో.. ప్రభాస్’తో పోటీ పడుతున్న అఖిల్!

బాహుబలి ప్రభాస్, బ్యాచిలర్ అఖిల్ ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నారు. అదీ కూడా ఒకే టైమ్ లో. ప్రభాస్ 20వ చిత్రం ‘రాధేశ్యామ్’, అఖిల్ నాల్గో సినిమా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’లో హీరోయిన్ గా నటిస్తోంది పూజా హెగ్డే.

ఈ రెండు సినిమాలు సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. పొద్దున ప్రభాస్ తో, సాయంత్రం అఖిల్ తో అన్నట్టుగా షూటింగ్ లో పాల్గొంటోంది పూజా. అయితే ఈ రెండు సినిమాలో రొమాంటిక్ లవ్ స్టోరీలే. అంతేకాదు.. వీటి ప్రమోషన్స్ కూడా ఒకే మాదిరిగా ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవలే రాధేశ్యామ్  నుంచి రొమాంటి పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బ్యాచిలర్ నుంచి ఓ రొమాంటి పోస్టర్ వదలబోతున్నట్టు సమాచారమ్. ఇప్పటికే ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ నుంచి హీరో, హీరోయిన్ పోస్టర్లని విడివిడిగా వదిలారు.

ఇప్పుడు వీరిద్దరి రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే రొమాన్స్ చేయడానికి ప్రభాస్, అఖిల్ పోటీ పడుతున్నారని చెప్పుకొంటున్నారు. మరీ.. ఫైనల్ గా వీరిద్దరిల్లో మోస్ట్ రొమాంటిక్ ఫెలో ఎవరు ? అనేది అభిమానులు తేలుస్తారు అనుకోండి.. !!