దేశంలో 14 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 49,931 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,35,453కు చేరింది. వైరస్‌ బారిన పడి కొత్తగా 708 మరణించడంతో మృతుల సంఖ్య 37,771కి పెరిగింది.

నిన్న ఒక్కరోజే 31,991 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 9,17,568 కి చేరింది. ప్రస్తుతం 4,85,114 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.