తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో ఆదివారం నమోదైన కొత్త కేసుల సంఖ్యలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. ఆదివారం తెలంగాణలో 1,473 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 8మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఒక్క జీహెచ్‌ఎంసీలో పరిధిలోనే 506 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 55,532కి చేరాయి. మృతుల సంఖ్య మొత్తం 471కి చేరింది. ఇప్పటి వరకు 42,106 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 12,955 మంది చికిత్స పొందుతున్నారు.