కరోనాను నుంచి కోలుకున్న ఐష్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఫ్యామిలీ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అమితాబ్ తో పాటుగా ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్యలకి కరోనా పాజిటివ్ వచ్చింది. అమితాబ్, అభిషేక్ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా, స్వల్ప లక్షణాలున్న ఐశ్వర్యారాయ్, ఆమె కూతురు ఆరాధ్య మాత్రం ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్నారు.

తాజాగా ఐష్, ఆరాధ్య కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ అభిషేక్ ట్విట్ చేసారు. “మా కోసం మీరు చేసిన ప్రార్ధనలకు ధన్యవాదాలు. మీ రుణం తీర్చుకోలేనిది. తాజాగా ఐశ్వర్య, ఆరాధ్యలకు చేసిన కరోనా టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చింది. ఇద్దర్నీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. ప్రస్తుతం వారు ఇంట్లో ఉన్నారు. నేను, నా తండ్రి ఇద్దరం ఇంకా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాం” అని రాసుకొచ్చారు.