TSలో 1,610 కొత్త కేసులు


తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1610 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 9 మంది కరోనా కారణంగా మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 57,142కు పెరిగింది. కరోనా మృతుల సంఖ్య 480కి చేరింది.

కొత్త నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 531 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకొని 803 మంది డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 42,909కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 13,753గా ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్‌లో వెల్లడించారు.