ట్రైలర్ టాక్ : ‘అజ్ఝాతవాసి’ మరోసారి నిరాశ పరిచాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్జాతవాసి’గా ఈ బుధవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రేపే బినిఫిట్ షోస్ పడిపోనున్నాయి. ఐతే, శనివారం సాయంత్రం విడుదలైన ‘అజ్ఝాతవాసి’ ట్రైలర్ పవన్ అభిమానులని మరోసారి నిరాశపరిచింది. ఇంతవరకు ‘అజ్ఝాతవాసి’ స్టోరీ లైన్ ఏంటీ అన్నది తెలియలేదు. ఆడియో వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్ స్టోరీ లైన్ చెబుతాడేమోనని వేయి కళ్లతో వెయిట్ చేస్తే.. ఆయన సినిమాలో పవన్ తన విశ్వరూపం చూపిస్తాడని చెప్పి మురిపించాడు అంతే.

పోనీ ట్రైలర్’లో ఆ కథేంటో మనమే కనిపెడదామని కాచుకూర్చోన్న అభిమానులకి నిరాశే ఎదురైంది. త్రివిక్రమ్ మార్క్ తో వచ్చిన ‘అజ్ఝాతవాసి’ ట్రైలర్ అదిరిపోయింది. “అజ్ఝాతవాసం ముగించుకొని అప్పుడే ఓ సభకు వచ్చిన పవన్ లా.. కట్ చేస్తే ఓ కుర్చీ కథ.. ఆ కథ సాగుతుండగానే ప్లాష్ బ్యాక్ లో రెండు మూడీ సీన్స్, ఓ యాక్షన్ బిట్ తో మినీ యుద్ధం ముగిసింది. ఆ వెంటనే వేగంగా దూసుకెళ్తున్న కార్ బ్లాస్ట్ కట్ చేస్తే ఆది పినిశెట్టి ఎంట్రీ.. “వయొలెన్స్ ఈజ్ నాట్ ఏన్ ఆప్షన్” డైలాగ్.. కట్ చేస్తే ‘ఏబీ ఎవరో నీ బేబీ’ సాంగ్ బిట్ కట్ చేస్తే కట్ చేస్తే హీరోయిన్స్ ఇద్దరు పవన్ ని కుమ్మేయడం.. కట్ చేస్తే సైకిల్ ఏపీసోడ్.. మళ్లీ సైకిల్ ఎక్కుతాడంటావా వర్మ.. వాడు ఎక్కిన పర్వాలేదు కానీ, మనల్ని ఎక్కకుంటే చాలు”తో ముగించాడు. ఇందులో భూతందం పెట్టిన కథేంటీ ? అన్నది కనిపెట్టలేం. కానీ, ఆ కథ ఎంత బాగుంటుందో ఊహించగలం.

అందుకే ‘అజ్ఝాతవాసి’ మరోసారి నిరాశపరిచాడని కొందరు పవన్ ఫ్యాన్స్ ఫీలైపోతున్నారు. ఇక, ఫీలవడానికేముంది.. ఒకరోజు వెయిట్ చేస్తే సినిమానే చూసెయొచ్చని సర్థుకుపోతున్నారు. తెలుగు రాష్ట్రాలు, యుఎస్ లోనూ భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న అజ్ఝాతవాసి రికార్డులు బద్దలు కొట్టాలని ఆశిద్దాం.