TSలో 1,764 కేసులు.. 12 మరణాలు !

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో తెలంగాణలో 1,764 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 12మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58,906కు పెరిగింది. మొత్తం కరోనా మృతుల సంఖ్య 492కు చేరింది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,97,939 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. రాష్ట్రంలో కరోనా నుంచి 43,751 మంది కోలుకోగా, మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 14,663కు చేరిందని అధికారులు వెల్లడించారు.