దర్శకుడు రాజమౌళికి కరోనా

సామాన్యులు, సెలబ్రిటీలు కూడా కరోనా బారినడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని తెలుపుతూ రాజమౌళి  ట్విట్ చేశారు. ‘గత కొన్నిరోజులుగా నా కుటుంబ సభ్యులు, నేను జ్వరంతో బాధపడ్డాం. దాంతో ఎందుకైనా మంచిదని కరోనా టెస్టులు చేయించుకున్నాం. ఫలితం నేడు పాజిటివ్‌గా చూపించింది. వైద్యులు సూచించిన విధంగా మేము హోం క్వారంటైన్‌ను విధించుకున్నాం’ అని రాజమౌళి ట్విట్టారు.

ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. బాహుబలి తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది. స్వాత్రంత్య్ర సరమయోధులు కోమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల మధ్యల గల ఓ కామెన్ పాయింట్ ఆధారంగా ఈ కథ రాసుకొన్నట్టు రాజమౌళి తెలిపారు. కొమరం భీమ్ గా ఎన్ టీఆర్, ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, ఆయనకి జంటగా అలియా భట్ నటిస్తున్నారు. వచ్చే యేడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.