ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్


తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాటని వారం తిరిగేలోగా నిలబెట్టుకున్నారు. ఈ నెల 24న కేటీఆర్ పుట్టినరోజుని జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆరు కోవిడ్ రెస్పాన్స్ ఆంబులెన్స్ లని ప్రభుత్వానికి అందిస్తానని కేటీఆర్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆంబులెన్స్ లని ఈరోజు అందజేశారు. ప్రగతి భవన్ లో ఆరు అంబులెన్స్ లని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సతీమణి, కూతురు పాల్గొన్నారు. మంత్రులు ఈటెల, ఎర్రబెల్లి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్ స్పూర్తిగా ప్రభుత్వానికి కోవిడ్ అంబులెన్స్ లని అందించడానికి పలువురు ప్రజానిధులు కూడా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చెక్కులని ఇటీవల కేటీఆర్ ని కలిసి అందజేశారు. త్వరలోనే ఆ అంబులెన్స్ లని కూడా ప్రారంభించనున్నారు.