సుశాంత్ కేసులో షాకింగ్ నిజాలు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చేలా ఉన్నాయ్. సుశాంత్ డిప్రెషన్ తోనే ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్థారించిన సంగతి తెలిసిందే. అయితే ఆ డిప్రెషన్  కు బాలీవుడ్ లో బంధుప్రీతినే కారణం. బాలీవుడ్ తీరే సుశాంత్ ని చంపేసిందని హీరోయిన్ కంగనా ఆరోపించింది. ఆమెకి పలువురు సపోర్ట్ చేసారు. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులు ముంబై పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులని విచారిస్తున్నారు.

మరోవైపు తన కొడుకు విషయంలో మొదట ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయని కేకే సింగ్.. ఇప్పుడు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మరో ఆరుగురిపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. రియా సుశాంత్ నుంచి డబ్బులు డిమాండ్ చేసింది. డబ్బులు తీసుకుంది. మానసికంగా వేధించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుశాంత్ మొదటి గర్ల్ ఫ్రెండ్ అంకితా లోక్వాండే కూడా ఇదే చెబుతోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసు ఆర్థిక పరమైన అంశాల వైపు టర్న్ తీసుకొంది. ఇందులో షాకింగ్ నిజాలు బయటికొస్తాయని చెప్పుకొంటున్నారు.