హీరోగా ఆర్జీవీ.. ఇక చుక్కలే !

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరోగా టర్న్ తీసుకోనున్నారు. ఆయన హీరోగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతుంది. ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా ? ‘ఆర్జీవీ మిస్సింగ్’. ఈ సినిమాపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారమ్. 

ఇటీవల వచ్చిన ఆర్జీవీ సినిమాల మాదిరిగా ‘ఆర్జీవి మిస్సింగ్’ చిన్న సినిమాగా వుండదు. సుమారు గంటకు పైగా వుండే థ్రిల్లర్ గా వుండబోతోందని తెలుస్తోంది. అంటే.. ? ఓ గంట పాటు వర్మ పైత్యాన్ని భరించాల్సిందే అన్నమాట. 

ఇక కరోనా టైమ్ లో వర్మ నుంచి క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్ సినిమాలొచ్చాయ్. ఆయన నుంచి మరో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మర్డర్, థ్రిల్లర్ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.