తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఒకట్రెండు రోజులుగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గినట్టు అనిపించింది. అయితే శుక్రవారం కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. 1,986 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 62,703కు పెరిగింది.

నిన్న ఒక్కరోజే కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 519కి చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 72.3 శాతంగా ఉంది. డెత్ రేటు 0.82శాతంగా ఉంది.