రైనాకు 15యేళ్లు

టీమ్‌ఇండియా బ్యాట్స్ మెన్ సురేశ్‌ రైనాకు 15యేళ్లు నిండాయ్. ఆయన అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి గురువారానికి 15 ఏళ్లు. ఈ సందర్భంగా సురేష్ భార్య ప్రియాంక ట్విట్టర్ వేదికగా హార్ట్ టచింగ్ మెసేజ్ పెట్టింది. ఆటపట్ల రైనాకు ఉన్న అంకిత భావం, తపన ఆమె పోస్ట్ లో కనిపిస్తున్నాయి.

‘నువ్వు తొలి వన్డే ఆడి పదిహేను సంవత్సరాలు గడిచింది! ఈ 15 ఏళ్లలో ఎన్నో విజయాలు అందుకున్నావు. ఎంతో కష్టపడ్డావు. ఎన్నో ఒడుదొడుకులూ ఎదుర్కొన్నావు. నీ అభిరుచి, నీ అంతకితభావం, నీకు లభించిన ఫలితాల్ని ఈ ప్రపంచం వీక్షించింది. నీ శ్రమ, నీ పిచ్చి, నువ్వు నిద్రపోని రాత్రులు, కొన్నింటికి నువ్వు పడ్డ బాధను నేను చూశాను. ఆట కోసం నువ్వెంత తప నపడ్డావో గమనించాను. తిరిగి నీ ఆటను నువ్వు అందుకొనేందుకు పడ్డ ఆవేదన, శ్రమ, నీకు అండగా నిలిచిన వారిని చూశాను’ అని ప్రియాంక రాశారు.