అయోధ్యపై జగన్’కు లేఖ రాసిన ఆర్ఆర్ఆర్

నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు లేఖా రాజకీయాలకి తెరలేపారు. ఆయన సీఎం జగన్ కు ప్రేమలేఖల్లా వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నారు. తాజాగా అయోధ్యలో రామాలయం శంకుస్థాపన నేపథ్యంలో సీఎం జగన్ కు లేఖ రాశారు ఆర్ ఆర్ ఆర్. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 5న చేయనున్న భూమిపూజ భారత దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.

‘అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగే రోజు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలి. దేవాదాయశాఖ పరిధిలోని 24వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పఠనం చేయాలి. భూమిపూజ కార్యక్రమాన్ని తితిదే ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలి” ఈమేరకు దేవాదాయశాఖను సీఎం జగన్‌ ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.