విశాఖ షిప్ యార్డ్ ఘటనపై రెండు కమీటీలు ఏర్పాటు

విశాఖ హిందూస్థాన్‌ షిప్‌ యార్డులో భారీ క్రేజ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఈ ఘటన వివరాలని విశాఖ కలెక్టర్‌ వినయ్‌ చంద్ మీడియాకు తెలిపారు. ఈ దుర్ఘటనలో మొత్తం 11 మంది మృతి చెందారు. ఇప్పటికే 10 మంది మృతుల వివరాలని కనుకొన్నాం. ఇంకో ఒకరి వివరాలు తెలియాల్సి ఉన్నాయన్నారు.

మృతుల్లో నలుగురు హెచ్‌ఎస్‌ఎల్‌ ఉద్యోగులు కాగా.. మిగిలిన ఏడుగురు కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు చెందినవారని తెలిపారు. ప్రమాద కారణాల కోసం కమిటీ ఏర్పాటుకు హెచ్‌ఎస్‌ఎల్‌ ఛైర్మన్‌ను కోరామన్నారు. హెచ్‌ఎస్ఎల్‌ ప్రమాదంపై రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏయూ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులతో కమిటీ, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ విభాగం నుంచి కమిటీ వేస్తామని కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు.