జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

ప్రతి జిల్లా కేంద్రంలో తెరాస పార్టీ కార్యాలయలాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని పూర్తవ్వగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వాటిని త్వరగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. శనివారం తెలంగాణ భవన్‌లో తెరాస ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్‌ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ” కరోనా వేళ పార్టీ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడితే వెంటనే స్పందించాలి. ప్లాస్మా దాతలను పార్టీ నేతలు ప్రోత్సహించాలి. కాంగ్రెస్‌ నాయకులు, ఇతర విపక్షాల ఆరోపణ లను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎక్కడికక్కడే తిప్పికొట్టండి. జిల్లా కమిటీలకు త్వరలో పార్టీ సమన్వయ కర్తలను నియమిస్తాం” అని కేటీఆర్‌ అన్నారు.