హాస్పటల్ లో చేరిన ఉత్తమ్

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాస్పటల్ లో చేరాడు. అలాగని ఆయనకి కరోనా ఏం సోకలేదు. మోకాలకి ఫ్యాక్చర్ తో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. అదెలా జరిగింది ? యాక్సిడెంటా ?? అనేది తెలియరాలేదు. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం మాత్రం ఉత్తమ్ మోకాలి దెబ్బతో హాస్పటల్ లో చేరారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్విట్ చేశారు.

పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ చాన్నాళ్ల నుంచి కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించబోతున్నట్టు చాలారోజులుగా ప్రచారం జరుగుతోంది. అప్పట్లో ఉత్తమ్ స్థానంలో రేవంత్ రెడ్డి పేరు బలంగా వినిపించింది. ఆ తర్వాత పీసీసీ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం కామ్ అయిపోయింది. ఇక ఇటీవలే బీజీపీ రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులని మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా త్వరపడి ఏపీ, తెలంగాణ పీసీసీ చీఫ్ లని మారుస్తుందేమో చూడాలి.