ఏపీలో 8,555 కొత్త కేసులు

ఏపీ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24గంటల్లో ఏపీలో 8,555 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,58,764కి చేరింది. మరో 67 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు కరోనాతో 1,474 మంది మృతి చెందారు.

గడిచిన 24 గంటల్లో 6,272 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 82,886కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 74,404 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కొత్త మృతి చెందిన 67మందిలో కృష్ణాలో 11 మంది, గుంటూరులో ఎనిమిది, తూర్పుగోదావరిలో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, కర్నూలులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన వారు ఇద్దరు ఉన్నారు.