తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2,012 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 13మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 70,958కి చేరింది. మృతుల సంఖ్య 576కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 1,139 కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 50,814కి చేరింది.

ప్రస్తుతం 19,568 మంది చికిత్స పొందుతున్నారు. ఓ వైపు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా.. మరోవైపు రికవరీ రేటు కూడా అధికంగా ఉండటం ఊరటనిస్తోంది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 70శాతానికిపైగా ఉంది. తెలంగాణలో మరణాల రేటు 0.81 శాతం ఉండగా..  దేశంలో అది 2.11 శాతంగా ఉందని ఉంది.