మాజీ మంత్రి సాంబశివరాజు కన్నుమూత

ఏపీ రాజకీయాల్లో విషాదం నెలకొంది. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సాంబశివరాజు గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయన గుర్తింపును సొంతం చేసుకున్నారు. 1989-94 లో మంత్రిగా, 1958లో సమితి ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. సాంబశివరాజు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు రాజకీయ గురువుగా కూడా.