TS కరోనా రిపోర్ట్ : 1,256 కేసులు.. 10 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. ఆదివారం 1,256 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80,751కి చేరింది. మరోవైపు 10 మంది కరోనా మృతి చెందారు. దీంతో.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 637కి పెరిగింది. నిన్న 1,587 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,528 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇన్నాళ్లు కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అధిక శాతం గ్రేటర్ హైదరాబాద్ లోనే నమోదవుతుండేవి. కానీ ఇప్పుడు గ్రామాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. పల్లెల నుంచి పట్నానికి వస్తున్న కరోనా రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. 70శాతం లక్షణాలు ఉన్న సమయంలో పల్లెల నుంచి కరోనా రోగులు పట్నం ఆసుపత్రిలో చికిత్స కోసం వస్తున్నారు. పల్లెల్లోనూ కరోనా విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.