కరోనాతో సినీ నిర్మాత మృతి

సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. వీరిలో కొందరు కరోనా పోరాటంలో ఓడిపోతున్నారు. మృతి చెందుతున్నారు. తాజాగా ప్రముఖ కోలీవుడ్ నిర్మాత, నటుడు వి. స్వామినాథన్ (62) కరోనాతో కన్నుమూశారు.

‘లక్ష్మీ మూవీ మేకర్స్’ బ్యానర్ వ్యవస్థాపకుల్లో స్వామినాథన్ ఒకరు. కే మురళీధరన్, వేణుగోపాల్ లతో ఈ బ్యానర్ ని స్థాపించారు. కోలీవుడ్ స్టార్స్ అజిత్, విజయ్, కమల్ హాసన్, సూర్య, కార్తిక్‌ తదితరులతో సినిమాలు నిర్మించారు. విజయాలు అందుకున్నారు. స్వామినాథన్ మృతితో కోలీవుడ్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మృతిపట్ల పలువురు కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.