తెలంగాణలో 1,896 కొత్త కేసులు.. 8 మరణాలు !

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 1,896 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,647కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 645కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,788 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 59,374కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 22,628కి చేరింది.

మరోవైపు కరోనా చికిత్స విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్రం, కోర్టులు అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. దేశంలోనే అతితక్కువ కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు చెడ్డ పేరొచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ మొద్దు నిద్రపోతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించిన సంగతి తెలిసిందే. ప్రయివేటు ఆసుపత్రుల ఆగడాలపై హైకోర్ట్ ప్రభుత్వాన్ని పలుమార్లు చివాట్లు పెట్టింది.