రవితేజ కిలాడీ 

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. రవితేజకి జంటగా శృతిహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమా ఉండనుంది.  హవీశ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాలో రవితేజ్‌ సరసన రాశిఖన్నా, నిధి అగర్వాల్‌ నటించనున్నారు.

ఈ సినిమాకు ‘కిలాడీ’ అని పేరు పెడతారని తెలుస్తోంది. ఇది రవితేజ మాస్ ఇమేజ్ కి సరిగ్గా సరిపోయే టైటిల్. అన్నీ కుదిరితే నవంబరులో సినిమా చిత్రీకరణ మొదలుపెడతారని తెలుస్తోంది. ‘రాక్షసుడు’ తర్వాత రమేష్ వర్మ చేస్తున్న చిత్రమిది.