ఏపీలో 2.5 లక్షలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య 2.5 లక్షలు దాటాయి. గత 24గంటల్లో ఏపీలో కొత్తగా 9,597 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,54,146 కి చేరింది. మరో 93 మంది కొవిడ్‌ కోరల్లో చిక్కుకొని మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,296కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90,425 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,61,425 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఒక్క రోజులో 6,676 మంది కోలుకున్నారని వెల్లడించింది. గత 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించగా.. ఇప్పటివరకు మొత్తం 26,49,767 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.