24 గంటల్లో 64,553 కేసులు.. 1007 మరణాలు 

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,553 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్.  దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 24,61,190కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 1007 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48,040కి పెరిగింది.

తాజాగా 55,573 మంది కరోనా నుంచి కోలుకోగా..ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17,51,555కి చేరింది. ప్రస్తుతం 6,61,595 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అమెరికా, బ్రెజిల్‌ తర్వాత భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. మరణాల్లో నాలుగో స్థానంలో ఉంది.