‘క్రాక్’ ఓటీటీ రిలీజ్ క్లారిటీ ఇచ్చారు 

గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌’. శ్రుతి హాసన్‌ కథానాయిక. చిత్రీకరణ సహా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 8న విడుదల కావల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడటంతో విడుదల వాయిదా వేశారు.

ఇటీవల కాలంలో సినిమాలన్నీ ఓటీటీ బాటపడుతున్న నేపథ్యంలో క్రాక్ కూడా అలాగే విడుదలకానుందని ప్రచారం మొదలైంది. దీంతో దర్శక-నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. ఈ వార్తలను దర్శకుడు గోపిచంద్‌ మలినేని ఖండించారు. తన ‘క్రాక్ ‘చిత్రాన్ని ఎప్పటికైనా థియేటర్ లోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు.