బాలు ఆరోగ్యం విషమం.. ఆందోళనలో అభిమానులు !

కరోనా బారినపడిన లెజెండ్ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషయంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 5న బాలుకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌ విడుదల చేశాయి.

“ఆగస్టు 5న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా, ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైంది. అయితే గురువారం రాత్రి ఆయన తిరిగి అస్వస్థతకు గురి కావడంతో వైద్య నిపుణుల సూచన మేరకు వెంటనే ఆయన్ని ఐసీయూకి తరలించాం. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది” అని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి. దీంతో బాలు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నారు.