డబుల్ షాక్ : ధోనితో పాటు రైనా కూడా గుడ్ బై !


క్రికెట్ ప్రేమికులకి నిమిషాల వ్యవధిలో డబుల్ షాక్ తగిలింది. టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే మరో ఆటగాడు సురేష్ రైనా నుంచి రిటైర్మెంట్ ప్రకటన వచ్చేసింది. ధోని రిటైర్మెంట్ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే రైనా రిటైర్మెంట్ ప్రకటన చేయడం విశేషం.

వన్డే, టీ20లకి రైనా స్పెషల్ ఆటగాడు. ఎన్నో సార్లు క్లిష్టపరిస్థితుల్లో జట్టుని ఆదుకున్నాడు. విజయాలు అందించాడు. సురేష్ రైనా మెరుపు ఫీల్డింగ్ గురించి తెలిసిందే. ధోని, రైనా ఇద్దరు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. వీరిద్దరు  ఒకేసారి అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోల్ పలకడం.. క్రికెట్ ప్రేమికులకి డబుల్ షాక్ తగిలినట్టయింది.