తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ప్రతిరోజూ దాదాపు 2వేలకి చేరువగా కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయ్. అవి కాస్త నిన్న తగ్గాయ్. నిన్న 1,102 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది మృతి చెందారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 91,361కి చేరింది. మృతుల సంఖ్య 693కి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 22,542కి చేరింది. కరోనా నుంచి కోలుకుని నిన్న 1,930 మంది డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 68,126కి చేరింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 234, కరీంనగర్‌లో 101, రంగారెడ్డి జిల్లాలో 81, మేడ్చల్‌లో 63, సంగారెడ్డిలో 66 కేసులు ఉన్నాయి.