కరోనా బారినపడిన హీరోయిన్ పరిస్థితి విషమం

సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కరోనా బారినపడుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్, ఎంపీ నవనీత్ కౌర్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారమ్. ఇటీవల నవనీత్ కౌర్ ఫ్యామిలీ కరోనా బారినపడింది. ఆమె కుటుంబంలో 11 మందికి కరోనా సోకింది. వారికి సేవలు చేసే క్రమంలో నవనీత్ కౌర్ కి కరోనా సోకింది. దీంతో ఆమె అమరావతి ఆసుపత్రిలో చేరారు. అరోగ్యం మరింత క్షీణిస్తుండటంతో..  ముంబై లోని లీలావతి హాస్పిటల్‌లో చేరారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిసింది.

నవనీత్ కౌర్ తెలుగులో పలు సినిమాల్లో నటించింది. యమదొంగ సినిమాలో యంగ్ టైగర్ ఎన్ టీఆర్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది. ప్రస్తుతం నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆమె అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిపొందారు. నవనీత్ కౌర్ కరోనా నుంచి కోలుకోవాలని ఆమె అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు.