బ్రేకింగ్ : అమిత్ షా ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిక

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్యం విషమించినట్టు సమాచారమ్. ఆయన్ని గురుగ్రామ్‌ మేదాంత ఆస్పత్రి నుంచి ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. శ్వాసకోశ సమస్యతో ఆయన ఎయిమ్స్‌లో చేరినట్లు సమాచారం. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలో అమిత్‌ షాకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు.

ఈ నెల 2న అమిత్ షాకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన  గురుగ్రామ్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఈ నెల 14న చేసిన టెస్టుల్లో అమిత్ షా కి నెగటివ్ వచ్చింది. అయినా.. డాక్టర్ల సూచన మేరకు మరో వారంరోజుల పాటు హోంక్వారంటైన్ లో ఉండనున్నట్టు తెలిపారు. అయితే తాజాగా అమిత్ షాకు శ్వాసకోశ సమస్య రావడంతో.. ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించి చికిత్స  అందిస్తున్నారు.