తెలంగాణలో లక్ష కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1763 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్.  దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 95700కి చేరింది.

నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య719కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1789 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 73,991కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 20,990కి చేరిందది.