దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 69,652 కొత్త  కేసులు నమోదయ్యాయి. దేశంలో 24గంటల వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,36,925కు చేరింది.

వీరిలో ఇప్పటి వరకు 20లక్షల 96వేల మంది కోలుకోగా మరో 6లక్షల 86వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 58వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 74శాతానికి చేరింది. మరణాల రేటు 1.9శాతంగా ఉంది.