తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కొత్త కేసుల నమోదు కాస్త తగ్గినట్టు అనిపించింది. ఇటీవల వెయ్యి లోపు కొత్త కేసులు నమోదయ్యాయ్. గ్రేటర్ హైదరాబాద్ లోనూ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. దీంతో తెలంగాణలో కరోనా క్రమంగా తగ్గతోంది అనుకున్నాం. ఇంతలో మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా కొత్త కేసులు నమోదు 2వేలకి చేరువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,967 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 8మంది మృతి చెందారు.

దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 99,391కి చేరింది. మృతుల సంఖ్య 737 కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,781 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 76,967కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 21,687గా ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.