శ్రీశైలం పవర్ హౌస్’లో భారీ అగ్నిప్రమాదం

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్తు కేంద్రంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాదంలో 9 మంది సిబ్బంది విద్యుత్తు కేంద్రంలోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. విద్యుత్తు కేంద్రంలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని జెన్‌కో సీఈ సురేష్‌ తెలిపారు.

మూడు మార్గాల ద్వారా విద్యుత్‌ సరఫరా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తూ రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. లోపలికి వెళ్లి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలిసే అవకాశముటుందని జెన్‌కో సీఈ సురేష్‌ తెలిపారు.