శ్రీశైలం ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం

శ్రీశైలం ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. దీనిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు.. దారితీసిన పరిస్థితులను వెలికితీయాలని సీఎం స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అదనపు డీజీ గోవింద్‌సింగ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.