కిషన్ రెడ్డి వెబ్ సైట్ హ్యాక్

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాకిస్థాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు హ్యాక్‌ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కిషన్‌ రెడ్డి వెబ్‌సైట్‌ హ్యాక్‌కు గురైంది. ఆయన వ్యక్తిగత వెబ్‌సైట్‌లో పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు పెట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ హ్యాకర్లు సందేశాలు పెట్టారు.

ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని కిషన్‌ రెడ్డి కార్యాలయం మంగళవారం ధ్రువీకరించింది. అయితే కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సమాచారమూ లేదని అధికారులు తెలిపారు. ఆయన వ్యక్తిగత వివరాలతో పాటు రోజువారీగా ఆయన పాల్గొంటున్న కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని స్పష్టంచేశారు.