TSలో 2,795 కేసులు, 8 మరణాలు !

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 2,795 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,14,483కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 788కి చేరింది.

కరోనా బారి నుంచి కోలుకుని నిన్న 872 మంది డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 86,095కి చేరింది. ప్రస్తుతం 26,700 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 449 కేసులు ఉన్నాయి.