మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

ఆ మధ్య దేశంలో నాన్ స్టాప్ గా పెట్రో ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల గ్యాప్ తర్వాత మరోసారి పెట్రో ధరల పెంపు మళ్లీ మొదలైంది. తాజాగా లీటరు పెట్రోల్‌పై 11 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ రూ.81.94 కి చేరింది.

చమురు సంస్థలు గడచిన 13 రోజుల్లో 11 సార్లు పెట్రోల్‌ ధరను పెంచాయి. 13 రోజుల్లో చమురు సంస్థలు లీటరు పెట్రోలుపై రూ.1.51 పైసలు పెంచాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతుండటం విశేషం. డీజిల్‌ అరలో ఎలాంటి మార్పు లేదు.