వైసీపీలో చేరిన తెదేపా నేత పంచకర్ల

ఏపీలో తెదేపా నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ మాజీ మ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ సమక్షంలో రమేష్‌బాబు పార్టీ కండువా కప్పుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.  

విశాఖను రాజధానిగా టీడీపీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల క్రితమే పార్టీకి ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరిపోయారు.