రియా, ఆమె సోదరుడిని విచారిస్తున్న సీబీఐ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఈ ఉదయం సీబీఐ ఎదుట హాజరైంది. ముంబయిలోని డీఆర్‌డీవో గెస్ట్‌హౌజ్‌లో రియా సహా ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని అధికారులు విచారిస్తున్నారు. వీరితోపాటు సుశాంత్‌ క్రియేటివ్‌ మేనేజర్‌ సిద్దార్థ్‌ పితాని, వంట మనిషి నీరజ్‌సింగ్‌, పనిమనిషి కేశవ్‌, ఇంటి మేనేజర్‌ సామ్యూల్‌లను కూడా దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది.

తన కుమారుడిని మానసికంగా వేధించారని, అతడి బ్యాంకు ఖాతాలోని డబ్బుని మళ్లించారని సుశాంత్ తండ్రి కేకే సింగ్‌ ఆరోపించారు. రియా, ఆమె కుటుంబసభ్యులతోపాటు పలువురిపై గతంలో బిహార్‌లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో సీబీఐ విచారణను వేగవంతం చేసింది.