‘ఆచార్య’ కథ బాలయ్య కోసం రాసుకున్నదట !


కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఇప్పుడీ క‌థ‌పై పెద్ద ర‌చ్చ జ‌రుగుతోంది. ఈ క‌థ నాదే అంటూ రాజేష్ అనే స‌హాయ ద‌ర్శకుడు మీడియాకు ఎక్కిన సంగతి తెలిసిందే. 2017లో ఈ కథని రాసుకున్నా. బాలయ్య కోసం రాసుకొన్న కథ ఇది. ‘పెద్దాయన’ వర్కింగ్ టైటిల్ తో రాసుకున్నానని చెబుతున్నారు.

ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ రివరెన్స్ తో మైత్రీ మూవీస్ బ్యానర్ వారికి కథని వినిపించా. అది వారికి బాగా నచ్చింది. కానీ ఇంత బడ్జెట్ ని కొత్త దర్శకుడిపై పెట్టలేం అన్నారు. ఇప్పుడీదే కథతో ఆచార్య తెరకెక్కుతోందని ఆరోపించారు. తన దగ్గర ఉన్న ఆధారాలని రైటర్స్ ఆసోసియేషన్ అందించారు. తనకి న్యాయం జరగాలని కోరుతున్నారు. మరోవైపు, కొరటాల సొంత కథతో ఆచార్య సినిమా తెరకెక్కుతోందని చిత్రబృందం చెబుతోంది. మొత్తానికి ఆచార్య కథ వివాదం చాన్నాళ్లపాటు కొనసాగేలా ఉంది.